గోరంట్ల ఫోటోగ్రాఫర్ గిరి కి తీవ్ర గాయాలు
సీమ వార్త అప్డేట్…
గోరంట్ల పట్టణంలోని రాజీవ్ కాలనీ ప్రాంతానికి చెందిన నరసింహులు కుమారుడు ఫోటోగ్రాఫర్ గిరి కి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ గిరి తో పాటు తన స్నేహితుడు హిందువుల ప్రాంతానికి చెందిన షమీ తో కలసి ద్విచక్ర వాహనంలో హిందూపురం వెళుతుండగా మార్గమధ్యంలోని చోళ సముద్రం వద్ద ప్రమాదానికి లోనై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం బోల్తాపడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డ వారిలో ఫోటోగ్రాఫర్ గిరి కి తీవ్ర గాయాలు కాగా మరో వ్యక్తి షమీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.