seemavartha.com
Newspaper Banner
Date of Publish : 20 August 2025, 9:20 am Digital Edition : SEEMA VARTHA DESK

అగ్ర పదవులు సాధించిన… ఆ ఇద్దరికి “అధికార” సన్మానం.

అగ్ర పదవులు సాధించిన… ఆ ఇద్దరికి “అధికార” సన్మానం.

…. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిరుపాల్, సింగిల్ విండో అధ్యక్షులు రవి మోహన్ లకు… ఎంపీడీవో నరేంద్ర గణ సత్కారం.

…. సచివాలయ అభినందన సభలో… ఆ ఇద్దరికీ అభినందనలు.

సీమ వార్త అప్డేట్ న్యూస్…

గోరంట్ల మండలంలోని గౌని వారి పల్లి పంచాయతీలోని ఇద్దరు టిడిపి నేతలకు పదవుల కేటాయింపులు అగ్రస్థానాలు దక్కడంతో హాయ్ ధరణి అభినందించారు గోరంట్ల మండలం ఎంపీడీవో నరేంద్ర కుమార్.నూతనంగా ఎన్నుకోబడిన గోరంట్ల మండల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా నియమించబడిన వాల్మీకి తిరుపాల్ కి, గౌనివారిపల్లి పంచాయతీ సింగిల్ విండో అధ్యక్షులుగా శీనప్పల్లి రవి మోహన్ కి పంచాయతీ సచివాలయం తరుపున గౌరవ అభినందన సభ ఏర్పాటు చేసి, గోరంట్ల మండల ఎంపీడీఓ నరేంద్ర కుమార్ అధ్యక్షతన వారిని సన్మాణించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మస్తాన్, సచివాలయం సిబ్బంది, మరియు డీలర్ నాగభూషణం, కమ్మలవాండ్లపల్లి శ్రీనివాసులు,రాఘవేంద్ర వాల్మీకి, రోహిత్, ఇమామ్ సాబ్,గంగాద్రి,మురళి, చాందు భాష, రామచంద్ర, మరియు గౌనివారిపల్లి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొనడం జరిగింది.