మోడీ 12 ఏళ్ల ప్రయాణంపై గోరంట్ల లో సంబరాలు.
…. గోరంట్ల BJP శాఖ ఆధ్వర్యంలో గుడిలో పూజలు.
సీమ వార్త అప్డేట్…
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా గోరంట్ల మండలం భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గోరంట్ల మండల అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ నేతృతంలో పట్టణ సమీపంలోని మరువ ఆంజనేయస్వామి ఆలయంలో పార్టీ శ్రేణులు పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బొట్టు శ్రీనివాసులు, ముంతాజమ్మ, పూల గంగాధర్, శంకర్ రెడ్డి, వెంకటాచలం, కాచర్ల హరీష్,భజంత్రి శంకర, సాయినాథ్ రెడ్డి, జయరాం నాయక్, లక్ష్మీనరసింహ, షబ్బీర్, నరేష్ యతీష్ రెడ్డి, పార్వతి బాయ్,శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
